ఈనెల 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో మహిళలకు మజ్జిగ ప్యాకెట్లు అందించాలన్నారు.