తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త అందించారు. కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు, హైదరాబాద్లో మరిన్ని మహిళాశక్తి బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల బలోపేతం, సామాజిక సాధికారతపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.