తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. స్వయం సహాయక బృందాలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోటి మంది మహిళలను బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్-2025 ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ల కోసం నాలుగు ఎకరాల భూమి కేటాయించారు. అలాగే.. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు మహిళా మార్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.