తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు 'ఇందిరా మహిళా శక్తి' చీరలను ఈ నెల 19న (ఇందిరా గాంధీ జయంతి) పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ పండుగ నాటికి నాణ్యత కారణంగా పంపిణీ వాయిదా పడింది. ఈసారి చీర ధరను రూ.800గా నిర్ణయించారు. గతంలో ఇది తక్కువగా ఉండేది. చీరలను సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లోని చేనేత కార్మికులతో తయారు చేయిస్తున్నారు. యువతులకు 6.5 మీటర్లు, వృద్ధులకు 9 మీటర్ల పొడవున్న రెండు రకాల చీరలను సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.