తెలంగాణలో 61 లక్షల స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ఉచిత చీరల పంపిణీకి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ పథకానికి రూ. 318 కోట్లు కేటాయించగా.. చీరల తయారీ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి లభించింది. దాదాపు 50 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. ఇందిరాగాంధీ జయంతి (నవంబర్ 19) లేదా ప్రభుత్వ ఏర్పాటు దినం (డిసెంబర్ 7) తేదీల్లో పంపిణీని ప్రారంభించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.