రైతన్నల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని పండుగలా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయ రంగంలోనూ మహిళలు రాణించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.