తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఒక్కొక్కరికి రూ.20 వేలు, భలే మంచి బేరం..!

2 months ago 18
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు నోట్ల కట్టలను విరజిమ్ముతున్నారు. చౌటుప్పల్‌లోని 20 వార్డుల్లో మూడు చోట్ల పోటీ అత్యంత రసవత్తరంగా మారింది. ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి తన పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేసే యువకులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున స్పాట్ పేమెంట్ ఇస్తుండటం చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి అభ్యర్థి కూడా అదే స్థాయిలో ఆశ చూపుతుండటంతో యువకులు ఉదయం ఒక పార్టీలో, సాయంత్రం మరో పార్టీలో చేరుతూ రాజకీయ అసలు రంగును బయటపెడుతున్నారు.
Read Entire Article