ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పటి వరకు మహిళలు, రైతులపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగంపై కూడా దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. యువతను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు తీసుకొస్తున్న ఈ పథకం.. రేపే ప్రారంభించనుంది.