తెలంగాణ రవాణాశాఖలో అధికారులకు పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం 'అదనపు కమిషనర్' అనే కొత్త పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కమిషనర్, జేటీసీల మధ్య వారధిగా ఉండే ఈ పోస్టు ప్రతిపాదన ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేస్తోంది.