స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన “ఎట్ హోమ్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని జిష్ణుదేవ్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.