తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్ కారిడార్లతో రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేల వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా నిలుస్తాయని ప్రకటించారు.