తెలంగాణలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం అధునాతన సాంకేతిక కేంద్రాల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు ఉండాలని, జీనోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు దశల్లో ఏటీసీల అభివృద్ధి జరుగుతుందని, మొదటి రెండు దశల్లో 49 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సీఎం సూచించారు.