తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహేశ్వరం, మిర్ఖాన్పేటలో నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ప్రజలకు శుభవార్త. డిసెంబర్ 10 నుంచి 13 వరకు సామాన్యులకు ఉచిత ప్రవేశం కల్పించారు. భవిష్యత్ ప్రాజెక్టుల సెషన్లు, ప్రభుత్వ స్టాల్స్ను ప్రజలు వీక్షించవచ్చు. కీరవాణి సంగీత కచేరి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రజల సౌలభ్యం కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, చార్మినార్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు.