తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందుతాయి. అయితే ఈ ఏడాది కొత్తగా రైతు బీమా పథకంలో చేరే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను వ్యవసాయ శాక అధికారులు విడుదల చేశారు.