తెలంగాణ రైతులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సన్నాలకు రూ.500 బోనస్, ప్రాసెస్ ఇదే..

2 weeks ago 9
సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ దళారుల చేతుల్లోకి వెళ్లకుండా అధికారులు పంటను దశలవారీగా ట్రాక్‌ చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే అన్నదాతల పట్టాదారు పాసుపుస్తకం, విత్తన రకం, సర్వే నంబర్‌ వివరాలను నమోదు చేస్తున్నారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వేలోనూ పంట వివరాలను పొందుపరుస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు లేదా నారు తెచ్చుకునే రైతుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుంటున్నారు. ఈ వివరాలను సివిల్‌ సప్లయ్స్‌ శాఖ క్రాస్‌చెక్‌ చేసిన తర్వాతే ఏడు సన్న రకాలకు బోనస్‌ అందించనున్నారు.
Read Entire Article