తెలంగాణలో సన్న రకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనుంది. ఈ బోనస్ పొందాలంటే పంట సాగు వివరాలను టీ-ఆగ్రిసీడ్స్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వివరాల నమోదుకు ఈనెల 10వ తేదీ చివరి గడువు. విత్తనాలు డీలర్ల వద్ద కొనుగోలు చేసిన రైతుల వివరాలను డీలర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సొంత విత్తనాలు ఉపయోగించిన రైతులు ఏఈవోలకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత సన్న రకాలకే బోనస్ వర్తిస్తుందని చెప్పారు.