తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా వంటి పంటల కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు, నిల్వ, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ కొత్త మైలురాయిని అధిగమించిందని.. 8.54 లక్షల టన్నులు కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు 48 గంటల్లో చేస్తామని హామీ ఇచ్చారు.