తెలంగాణలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 10 కొత్త మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. దీంతో రాష్ట్రంలో యార్డుల సంఖ్య 207కు చేరుతుంది. ఈ నిర్ణయం రైతులకు మెరుగైన ధరలు, తక్కువ రవాణా ఖర్చులు, పంట నిల్వ సౌకర్యాలు వంటి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అదనంగా.. మరో ఐదు మార్కెట్ యార్డుల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.