తెలంగాణ రైతులకి శుభవార్త. అడవి జంతువుల దాడిలో పశువులు చనిపోతే పరిహారం కోసం ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడక్కర్లేదు. అటవీ శాఖ కొత్త విధానం ద్వారా నేరుగా మీ ఖాతాలోనే డబ్బులు జమ కానున్నాయి. ఈ కొత్త పద్ధతి వల్ల రైతులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, మరింత పారదర్శకంగా ఉంటుంది.