Telangana Farmers Free Solar Pump Sets Update: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలను ఎంపిక చేస్తామని చెప్పారు. రైతులకు సోలార్ ఉచిత పంపుసెట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి వనరులను వినియోగించుకుని కాలుష్యరహితంగా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.73వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. భవిష్యత్లో రైతులకు పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.