తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండుమిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో 'తేజా' రకం మిర్చి క్వింటాలుకు రూ. 14,500 పలికింది. దిగుబడి తగ్గడం, ఎగుమతులు పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ధరలు మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉంది. పెరిగిన ధరలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.