రైతులకు ఆధార్ తరహాలో 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేంద్రం కేటాయించనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తయిన ఈ ప్రక్రియ తెలంగాణలో ఏప్రిల్ 23న ప్రారంభం కానుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏఈవోలు రైతు బయోడేటా, భూమి వివరాలు సేకరించి ఆధార్, ఫోన్ నంబర్తో అనుసంధానం చేస్తారు. కేంద్ర పథకాల లబ్ధికి, ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి పీఎం కిసాన్ నిధికి ఈ సంఖ్య తప్పనిసరి.