రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకుంటుందని తెలిపారు. వరద బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.