తెలంగాణలో ఉద్యాన పంటల నిల్వ కోసం ప్రభుత్వ రంగంలో తొలిసారి శీతల గిడ్డంగులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న పదివేల టన్నుల సామర్థ్యం గల స్టోరేజీ త్వరలో ప్రారంభం కానుంది. మరో 10కి పైగా జిల్లాల్లో స్థల సేకరణ జరుగుతోంది. దీనివల్ల మిర్చి, కూరగాయల రైతులు పంటను నిల్వ చేసుకుని.. మార్కెట్లో మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. తద్వారా పంట వృథాను అరికట్టి రైతులకు లాభాలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం.