అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించింది. ఈనెల 20న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. తొలి విడత రైతు భరోసా నిధులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా.. సోమవారం రోజున రెండో విడత డబ్బులను రైతు అకౌంట్లలో వేయనున్నట్లు వెల్లడించింది. ఈ విడతలో రాష్ట్రంలోని 45 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.