తెలంగాణ రైతులకు శుభవార్త. సన్న రకం ధాన్యం సాగు చేసిన వారికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లింపు ప్రారంభమైంది. కనీస మద్దతు ధరతో పాటు ఈ బోనస్ మొత్తాన్ని విడతలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి బోనస్ బకాయిలు కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.