తెలంగాణలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రోడ్లు చిత్తడిగా మారి గుంతలు ఏర్పడ్డాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.