రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఓవర్లోడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్ చేయాలని.. రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే.. అలాంటి వారి లైసెన్సులు,వెహికల్ పర్మిట్లు రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు ముమ్మరం చేసి, వేలాది కేసులు నమోదు చేశారు. ప్రమాదాల నివారణకు విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.