తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఆదేశించింది. జనగామ, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు.