తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. చదువుకుంటూనే సంపాదన.. డిగ్రీ, పీజీ సిలబస్‌లో బారీ మార్పులు...

5 months ago 16
తెలంగాణలో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు చదువుకుంటూనే ఉపాధి పొందేలా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ను ప్రక్షాళన చేస్తూ.. ఐఐటీ, డీఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల సలహాలతో కొత్త పాఠ్యప్రణాళికను రూపొందించనున్నారు. కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కాకుండా.. వృత్తి నైపుణ్యాలను పెంచే కోర్సులను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు విస్తరించాలని టీజీసీహెచ్‌ఈ నిర్ణయించింది. అలాగే యూనివర్సిటీల్లోని ఆధునిక ల్యాబ్‌లు, వనరులను పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా వాడుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు.
Read Entire Article