తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ప్రభావం, ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.