అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా ఆగస్టు 5 నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.