తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఈసారి నైరుతి రుతుపవనాలు మే 27నే రాష్ట్రంలోకి ప్రవేశించి.. వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగించాయి. జూన్ రెండో వారం తర్వాత వర్షాలు స్థిరంగా కురుస్తాయని వాతావరణశాఖ అంచనా.