బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. అయితే..రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగనుంది. మరోవైపు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.