తెలంగాణలో రుతుపవనాల జోరు తగ్గడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎండాకాలం మాదిరిగా రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. జూన్ 10 తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పగటిపూట కాస్త ఎండలు, సాయంత్రానికి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.