బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆగస్టు 5 తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాలు సరిగా కురవకపోటవంతో 4 శాతం లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ రానున్న వర్షాలు ఆ లోటును భర్తీ చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.