ఈ ఏడాది తెలంగాణలో వర్షాలు అంచనాలను మించి కురిశాయి. సాధారణం కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం రికార్డయింది. రుతుపవనాలు ముగియడంతో ఇకపై వర్షాలు తగ్గుముఖం పట్టి, చలి తీవ్రత పెరగనుంది. ఆదిలాబాద్, హైదరాబాద్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.