తెలంగాణ రైతులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో కోట్లకు అమ్ముడవుతున్న భూములకు, ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూ మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మార్కెట్ విలువ సవరణకు సిద్ధమవుతోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఎకరాకు 6 లక్షలుగా ఉన్న రేటు 12–18 లక్షల వరకు చేరవచ్చు. దీంతో రైతులు అమ్ముకునే పరిస్థితి వచ్చినా సరైన లాభం పొందే అవకాశం ఉంది.