తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, ఎం. దాన కిశోర్లకు అపెక్స్ స్కేల్ (లెవల్-17) పదోన్నతి లభించింది. వీరు తమ శాఖల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక.. పోలీస్ విభాగంలో 2012 బ్యాచ్కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులైన ఎన్. శ్వేత, ఆర్. భాస్కరన్, జి. చందన దీప్తి, కల్మేశ్వర్ శింగెనవర్, ఎస్.ఎం. విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శినిలను డీఐజీ స్థాయికి ప్రమోట్ చేశారు. ఈ పదోన్నతులన్నీ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.