తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదని.. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ మద్దతునిచ్చి ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.