తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు షురూ అయింది. పంచాయతీరాజ్శాఖ కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. పెరిగిన పంచాయతీలు, వార్డులకు అనుగుణంగా టీపోల్ సాఫ్ట్వేర్లో పంచాయతీ కార్యదర్శులు జాబితాను అప్లోడ్ చేస్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.