తెలంగాణ సచివాలయం వద్ద మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ జెండాను జకీర్ అనే యువకుడు తొలగించాడు. సోషల్ మీడియాలో లైవ్స్ట్రీమ్ చేస్తూ జెండాను తొలగించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం అధికారులు తిరిగి ఇజ్రాయెల్ జెండాను పునఃస్థాపించారు.