తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రజలను తీవ్ర గందరగోళంలో పడేసింది. రేవంత్ సర్కార్.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియకు న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. దీంతో ఇప్పటికే విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నవంబర్ 7న ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఆ వివరాలు..