తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2004 ఆగస్టు 31 వరకు పాత పింఛన్ విధానం అమల్లో ఉన్నందున వీరంతా పాత పింఛన్ విధానానికి అర్హులని కోర్టు స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన ఆలస్యం వల్ల నియామక ఉత్తర్వులు ఆలస్యంగా ఇచ్చినా.. వారంతా పాత పింఛన్కే అర్హులని తేల్చింది. వారికి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.