తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గాడి ప్రవీణ్కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్లు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జూలై 19న బాధ్యతలు స్వీకరించారు. అయితే, నూతన నియామకాలతో కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగినప్పటికీ.. ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీతో న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది.