Lakshmi Parvathi Petition On Basavatarakam Trust: తెలంగాణ హైకోర్టులో లక్ష్మీపార్వతికి షాక్ తగిలింది. బసవతారకం ట్రస్ట్ను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. 1995లో రాసిన సప్లిమెంటరీ విల్లు చట్ట ప్రకారం నిరూపించకపోవడం కారణంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ప్రతివాదులు బసవతారకం ట్రస్ట్, నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ ఉన్నారు.