తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన దిగ్గజ కార్ల సంస్థ BYD సిద్ధమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సమీపంలో ఇండియాలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ రెడీ అయింది. ఈ సంస్థ పెట్టుబడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము తీసుకున్న విధానాల వల్లే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు బీవైడీ ముందుకొచ్చిందని అన్నారు.