Telangana Rising: సీఎం రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా 2047 నాటికి తెలంగాణను గ్లోబల్ పవర్హౌస్గా మార్చాలనే విజన్ను ప్రకటించారు. తమ పోటీ చైనా, జపాన్లతోనని ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు 'క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE)' పేర్లతో మూడు ఆర్థిక జోన్లుగా విభజిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పెట్టుబడులతో పాటు తమ విజన్ను ప్రపంచానికి వివరించడమే సమ్మిట్ లక్ష్యమన్నారు.