తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'నగర్ వన్ యోజన' కింద రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 6 అర్బన్ ఫారెస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటి అభివృద్ధికి రూ. 8.26 కోట్లు మంజూరు చేసింది. పట్టణాల్లో పచ్చదనం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కాగా, పట్టణాల్లో ఏర్పాటు చేయబోయే ఈ వనాలల్లో స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలంగాణ అటవీ శాఖ అధికారులు తెలిపారు.