తెలంగాణ రైల్వే మౌలిక వసతుల విస్తరణకు కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది. ఘట్కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,419 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్-వరంగల్ మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికులు, సరకు రవాణాకు మరింత వెసులుబాటు కలగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 5 ప్రాజెక్టులకు రూ.10,021 కోట్లు కేటాయించనున్నారు.